సాగునీటిని వృథాచేయకుండా పొదుపుగా వాడుకోవాలి

 నిజాం సాగర్ ను సందర్శించిన మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి
నిజాం సాగర్, బతుకమ్మ: నిజామాబాద్ జిల్లా రైతుల వరప్రదాయయని నిజాంసాగర్ ప్రాజెక్టు ను బోదన్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి సుధర్శన్ రెడ్డి సందర్శించారు. మంగళవారం ప్రాజేక్టును సందర్శించిన ఆనంతరం సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ దేవుని దయ వల్ల ఈసారి ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండిందని కావున రైతులు సాగునీటిని వృథాచేయకుండా పొదుపుగా వాడుకోవాలని కోరారు.అలాగే ప్రాజెక్టు వద్ద వచ్చే సందర్శకుల మౌలిక సౌకర్యాలు,బోటింగ్ సౌకర్యం కొరకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఉర్దూ అకాడమీ చైర్మన్ తహర్ బిన్ హందన్ ,ఎడపల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షులు పులి శ్రీనివాస్ ,బిల్లా రామ్మోహన్ ,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు వై. నరేందర్ రెడ్డి , సాలురా మండల కాంగ్రెస్ అధ్యక్షులు మంధర్న రవి ,వైస్ చైర్మన్ చీల శంకర్ ,జైతాపూర్ పాక్స్ చైర్మన్ సత్యనారాయణ,సాలురా క్యాంపు మాజీ సర్పంచ్ శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.

Irrigation water should be used sparingly without wasting it
Comments (0)
Add Comment