గురుకుల మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సి.శోభారాణి
కామారెడ్డి, బతుకమ్మ : కామారెడ్డి జిల్లా సదాశివ నగర్ మండల్ మర్కల్ లోని గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో కామర్స్, ఎకనామిక్స్, బాటనీ, తెలుగు, కంప్యూటర్ సైన్స్ సబ్జెక్ట్ అధ్యాపక పోస్ట్ ఖాళీగా ఉన్నాయని ప్రిన్సిపల్ శోభారాణి తెలిపారు. ఆసక్తి అర్హత కలిగిన మహిళ అభ్యర్థుల దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. ఈనెల 12న గురువారం ఉదయం 10 గంటలకు డెమో ఇంటర్వ్యూ ఉంటుందన్నారు. అన్ని ఓరిజినల్ సర్టిఫికెట్స్ వెంట తెచ్చుకోవాలని ఆమె తెలిపారు.