రుద్రూర్, ఆగష్టు11 (బతుకమ్మ): రుద్రూర్ మండలంలోని సులేమాన్ నగర్ గ్రామ శివారులో గల (గైనీ గుట్ట) బసవేశ్వర ఆలయంలో ఆదివారం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయించారు. ఆలయంలో, ఆలయ పరిసర ప్రాంతాల్లో ఇటీవల జరిగిన దొంగతనాలను ఇకముందు జరగకుండా నివారించేందుకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. భక్తుల రక్షణ కోసం ఆలయ పరిధిలో మొత్తం ఎనిమిది సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు ఆలయ పూజారి పరమేష్ మహారాజ్, ఆలయ కమిటీ సభ్యుడు రాజు తెలిపారు.