భిక్కనూర్ గురుకుల పాఠశాల తనిఖీ

 బతుకమ్మ, బిక్కనూర్: బిక్కనూర్ మండలంలోని గురుకుల పాఠశాలను భిక్కనూర్ మండల స్పెషల్ ఆఫీసర్ రజిత మంగళవారం తనిఖీ చేశారు. ముందుగా పాఠశాల లోని తరగతి గదులను పరిశీలించి భోజనశాలను మరియు గ్రంథాలయాన్ని తనిఖీ చేశారు విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా స్పెషల్ ఆఫీసర్ రజిత మాట్లాడుతూ గురుకుల పాఠశాలలోని విద్యార్థులకు అధ్యాపకులు నాణ్యమైన విద్యతో పాటుగా నాణ్యమైన భోజనాన్ని అందించాలన్నారు ఈ కార్యక్రమంలో బిక్కనూర్ ఎంపీడీవో రాజాకిరణ్ సిద్ధ రామేశ్వర నగర్ గ్రామపంచాయతీ కార్యదర్శి నవీన్, పాఠశాల అధ్యాపకులు పాల్గొన్నారు.

Inspection of Bhikkanur Gurukula School
Comments (0)
Add Comment