- డ్రగ్స్ తీసుకునే వారిపై ఉక్కు పాదం మోపాలి
- PDSU -PYL డిమాండ్
బతుకమ్మ, నిజామాబాద్ సిటీ : నిజామాబాద్ జిల్లాలో డ్రగ్స్ మరియు ఇతర మాదక ద్రవ్యాలు ను అరికట్టాలని విద్యార్థి యువజన సంఘం నాయకులు జన్నారపు రాజేశ్వర్, వనమాల సత్యం లు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా నిజామాబాద్ జిల్లా డిసిపి కోటేశ్వరరావు కి విద్యార్థి, యువజన సంఘల ఆద్వర్యంలో వినతిపత్రం అందించారు.
ఈ సందర్బంగా నాయకులు మాట్లాడుతూ జిల్లా లో పక్క రాష్ట్రాల నుండి డ్రగ్స్,గంజాయి మరియు ఇతర మరక ద్రవ్యాలు సరఫరా అవుతున్నాయని , జిల్లా లో విద్యార్థులు యువత డ్రగ్స్ కి బానిసై వారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారని , రైల్వే స్టేషన్ బస్టాండ్ అడ్డలుగా మార్చుకొని కోట్ల రూపాయలు వ్యాపారం జరుగుతుందని, హాస్టల్ విద్యార్థులు కూడా వాటికి బానిసైతున్న పరిస్థితి జిల్లాలో ఉందని, పండుగల నేపథ్యంలో విపరీతంగా డ్రగ్స్ సరఫరా అయ్యే అవకాశాలు ఉన్నాయని, రాత్రి వేళల్లో పీకేటింగ్ పెంచాలని , జిల్లా సరిహద్దులలో తనిఖీలు విస్తృతంగా నిర్వహించాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో పి. వై .ఎల్ జిల్లా ఉపాధ్యక్షులు బండమీద నర్సయ్య, పి.డి.ఎస్.యూ జిల్లా నాయకులు నిఖిల్ , పి. వై.ఎల్ జిల్లా నాయకులు భాస్కర్ , మనోజ్ తదితరులు పాల్గొన్నారు.