ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ జాతీయ మహాసభలకు డా. విశాల్

బతుకమ్మ, నిజామాబాద్ : ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ జాతీయ మహాసభలు ఆగ్రా పట్టణంలో అట్టహాసంగా నిర్వహించినట్లు న్యూరో సైకియాట్రిక్ డా. విశాల్ తెలిపారు. ఈ సభలకు జిల్లా నుంచి తాను హాజరైనట్లు పేర్కొన్నారు. న్యూరో సైకియాట్రిక్ పోస్ట్ గ్రాడ్యూయేషన్ విద్యార్థులకు నూతన వైద్య విధానాలు, చికిత్స విధానాలపై వివరించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి డా.విశాల్, డా.ధనుంజయ్ ఛైర్పర్సన్ గా వ్యవహరించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు డా.విశాల్ ను సన్మానించారు.

Indian Psychiatric Society National Congress Dr. Vishal
Comments (0)
Add Comment