కాళోజి యాదిలో

బతుకమ్మ, మోర్తాడ్:  తెలంగాణ భాషా దినోత్సవాన్ని, కాలోజి నారాయణరావు జయంతిని సోమవారం మోర్తాడ్ మండలంలోని శెట్ పల్లీ గ్రామంలో గల జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. కాళోజి చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పాఠశాలలోని తెలుగు ఉపాధ్యాయురాలు గోదావరిని ఉపాధ్యాయులు, విద్యార్థులు శాలువాతో సన్మానించి అభినందించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వెంకటయ్య, ఉపాధ్యాయులు సుదర్శన్, అన్నపూర్ణ, శ్రీనివాస్, రవి,శంకర్, లక్ష్మికుమారి, సుమీత తదితరులు పాల్గొన్నారు.

In Kaloji Yadi
Comments (0)
Add Comment