కరెంటు వైరు అమర్చి మరొక వ్యక్తి మరణానికి కారణమైన వ్యక్తికి జైలు

  •  ఐదు సంవత్సరాలు జైలు శిక్ష 15 వేల జరిమానా విధింపు

బతుకమ్మ, కామారెడ్డి : పొలం వద్ద జంతువుల నుంచి రక్షణ కొరకు ఏర్పాటుచేసిన విద్యుత్ కంచెను నిర్వహణలో నిర్లక్ష్యం చేసి వ్యక్తి మరణానికి కారకుడైన మరొక వ్యక్తికి న్యాయస్థానం జైలు శిక్ష విధించింది. కామారెడ్డి జిల్లాలో జరిగిన ఈ కేసుకు సంబంధించిన పూర్వపరాలు ఇలా ఉన్నాయి. కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండలం మేంగారం గ్రామానికి చెందిన చౌల దత్తు ( 25 )అను వ్యక్తి 14 అక్టోబర్ 2018 న రాత్రి 9 గంటల సమయంలో ఎప్పటి మాదిరిగానే పొలం కాపలాకి వెళ్లి మరుసటి రోజు మధ్యాహ్నం వరకు ఇంటికి తిరిగి రాలేదు. అని అతని బార్య అగు పవన్య ఫిర్యాది మేరకు లింగంపేట్ పోలీస్ స్టేషన్ నందు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

పరిశోధనలో భాగంగా మృతుని కుటుంబ సభ్యులను, పొలం పక్కవారిని, గ్రామస్తులను, ఇతర గ్రామస్తులను విచారించి, సాక్ష్యాధారాలు పరిశీలించి తర్వాత అజాగ్రత్తతో పొలానికి కరెంటు వైరు అమర్చి వ్యక్తి మరణానికి కారణమైన తలరి సాయిలునేరస్తునిగా గుర్తించి అరెస్టు చేయడం జరిగింది. ఎప్పటి మాదిరిగానే మృతుడు 10 సంవత్సరాల నుండి తలారి సాయిలు నుండి పొలమునకు నీళ్లు తీసుకుంటున్నాడు దానికి గాను పండిన పంటలో కొంత ఇస్తున్నాడు. అదే విధంగా తేదీ; 14. 10. 2018 నాడు రాత్రి ఎప్పటి మాదిరిగానే పొలం దగ్గరికి వెళ్ళినాడు. అదే సమయంలో ఇతన ఇతని ప్రక్కన పొలం ఉన్న తలారి సాయిలు ఎలాంటి జాగ్రత్త పాటించకుండా నిర్లక్ష్యంగా జె వైరు పొలని అమర్చి దానికి కరెంటు మోటార్స్ స్టార్టర్ నుండి అక్రమంగా కరెంటు సప్లై తీసుకొని జె వైరుకు సప్లై ఇచ్చినాడు. మృతుడు పొలం దగ్గర ఈ జె వైరుకు తగిలి చనిపోయినాడు.

నిందుతుడు తేదీ 15 అక్టోబర్ 2018 న తెల్లవారుజామున 5 గంటల సమయంలో మసక మసక చీకటిలో కరెంట్ సప్లై తీసేద్దాం అని పోయి చూసేసరికి జె వైరు కు తగిలి దత్తు చనిపోయినడు . అది చూసిన తలరి సాయిలు అట్టి చావు తన పై వస్తుందని మృతుని ఉద్దేశపూర్వకంగా పక్కనున్న చెరువులో పడేసి సాక్షాలు లేకుండా చేసినాడు. ఈ విషయములో సరియగు సాక్షాదారాలను సేకరించి నేరస్తుడిపై కోర్టు యందు అభియోగ పత్రం వేయడం జరిగింది.
కేసులో సాక్షులను విచారించి, సాక్షాదారాలను పరిశీలించి కేసు రుజువు కావడం తో కామారెడ్డి మొదటి అదనపు జిల్లా జడ్జి లాల్ సింగ్ శ్రీనివాస్ నాయక్ నిందితుడు సాయిలుకు ఐదు సంవత్సరాలు జైలు శిక్ష , 15 వేల జరిమానా విధింపు శిక్ష విధిస్తూ తీర్పు ఇవ్వడం జరిగినది. అదేవిధంగా ఎలక్ట్రిక్ యాక్ట్ ప్రకారం మృతుని చావుని ఉద్దేశపూర్వకంగా ప్రక్కదోవ పట్టించినందుకు గాను శిక్ష జరిమానా వేయడం జరిగినది
ఈ కేసును సరియగు పద్దతిలో విచారణ చేసిన అప్పటి ఎల్లారెడ్డి సి‌ఐ ఎ. సుధాకర్ , యస్ ఐ సుఖేందర్ రెడ్డి , పోలీసు తరపున వాదనలు వినిపించిన పీపీ నంద రమేష్ , కోర్టు లో సాక్షులను ప్రవేశపెట్టిన ప్రస్తుత సిఐ, రవీంద్ర నాయక్ , ప్రస్తుత ఎస్ఐ చైతన్య రెడ్డి , కోర్టు లైజనింగ్ ఆఫీసర్ ఎస్‌ఐ టి. మురళి, కోర్ట్ కానిస్టేబుల్ కిరణ్ గౌడ్ లను జిల్లా ఎస్పీ సింధు శర్మ అభినందించారు.

Imprisonment for a person who caused the death of another person by installing an electric wire
Comments (0)
Add Comment