- నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కేశ వేణు
బతుకమ్మ, నిజామాబాద్ :
రాజీవ్ గాంధీ విగ్రహంపై చేయి పడితే బిఆర్ఎస్ నాయకులను తరిమికొడతాం అని నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కేశ వేణు అన్నారు. కాంగ్రెస్ భవన్, వినాయక్ నగర్ లో భారతరత్న స్వర్గీయ రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కేశ వేణు ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలవేసి కాంగ్రెస్ నాయకులు ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా నగర కాంగ్రెస్ అధ్యక్షులు కేశ వేణు మాట్లాడుతూ రాజీవ్ గాంధీ ప్రధానిగా దేశాన్ని అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్లారని, విప్లమాత్మక ఆలోచన వల్లనే ఈ దేశం ఐటి రంగంలో ప్రపంచ దేశాలతో పోటీపడి విధంగా ఎదిగిందని ఆయన అన్నారు. రాజీవ్ గాంధీకి ఉన్న దీర్ఘకాలిక ఆలోచనల వల్ల ఐటీ రంగాన్ని అభివృద్ధి చేయడం ద్వారా ప్రస్తుతం దేశంలో ఎంతో మంది ఐటి రంగంలో ఉపాధి పొందుతున్నారని, అదేవిధంగా 18 సంవత్సరాలకే యువతకు ఓటు హక్కు కల్పించి దేశ అభివృద్ధిలో యువకుల పాత్ర ముఖ్యమని విధంగా తెలిపిన వ్యక్తి రాజీవ్ గాంధీ అని ఆయన అన్నారు. రాజీవ్ గాంధీ ఐటీ రంగాన్ని అభివృద్ధి చేయడం ద్వారానే కేటీఆర్ ఐటి మినిస్టర్ గా గతంలో ఉండడం జరిగిందని, అది కేవలం రాజీవ్ గాంధీ చలువ అని కేటీఆర్ గుర్తు ఉంచుకోవాలని కేశ వేణు అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీ ముందు రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామంటే దాన్నిని పగలగొడతామని కేటీఆర్ మాట్లాడుతున్నాడని అక్కడ తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టమని చెప్తున్నాడని 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న కేటీఆర్ అసెంబ్లీ ముందు తెలంగాణ తల్లి విగ్రహం పెట్టకుండా ఏం చేశారని ప్రశ్నించారు. అదేవిధంగా రాజీవ్ గాంధీ విగ్రహం పై చేయి పెడితే కేటీఆర్ ను రోడ్లపై తరిమి కొడతామని రాజీవ్ గాంధీ గురించి మాట్లాడే హక్కు అర్హత కేటీఆర్ కు లేదు అని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు డిసిసిబి చైర్మన్ రమేష్ రెడ్డి,ముప్పా గంగారెడ్డి, జిల్లా ఎన్ ఎస్ యు ఐ అధ్యక్షులు వేణు రాజ్, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు లింగం,సేవాదళ్ అధ్యక్షులు సంతోష్,వినయ్,రాజేష్,ఉష,ప్రభాకర్,నర్సింగ్,సాయి కుమార్,ప్రమోద్ తదితరులు పాల్గొన్నారు.