ఐడీసీఎంఎస్ చైర్మన్ ఎన్నిక ఉత్కంఠ

  • నామినేషన్ దాఖలు చేసిన ఇద్దరు
  • కామారెడ్డికా లేక నిజామాబాద్ కా?

బతుకమ్మ న్యూస్, ప్రత్యేక ప్రతినిధి: ఇందూరు డిస్ట్రిక్ కోఆపరేటివ్ సొసైటీ చైర్మన్ ఎన్నిక ఉత్కంఠ నెలకొంది. మొన్నటి వరకు చైర్మన్ గా ఉన్న సాంబరి మోహన్ పై ప్రభుత్వం మారగానే డైరెక్టర్లు అవిశ్వాసం ప్రకటించిన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో నిజామాబాద్ ఐడీసీఎంఎస్ చైర్మన్ ఎన్నిక అనివార్యమైంది. సాంబారి మోహన్ పదవికి రాజీనామా చేసిన అనంతరం బిక్కనూర్ కు చెందిన ఇంద్రకరణ్ రెడ్డి ఇంచార్జి చైర్మన్ గా వ్యవహరించిన విషయం తెల్సిందే. అయితే ఇటీవల చైర్మన్ ఎన్నికకు జిల్లా సహకార అధికారి నోటిఫికేషన్ జారీ చేశారు.

కామారెడ్డి జిల్లా గాంధారి సొసైటీ చైర్మన్ సాయికుమార్ ఆలియాస్ సాయన్న, డిచ్ పల్లి మండలం రాంపూర్ సొసైటీ చైర్మన్ నాయక్ పోటీ పడుతున్నారు. ఇరువురు చైర్మన్ రేసులో బరిలో ఉన్నారు. అయితే సాధారణంగా డీసీసీబీ చైర్మన్, ఐడీసీఎంఎస్ చైర్మన్ పదవులు ఉమ్మడి జిల్లాలో ఏదో ఒక జిల్లాకు ఒక చైర్మన్ పదవి సాంప్రదాయం కొనసాగుతుంది.

కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే కామారెడ్డి జిల్లాకు చెందిన డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి పదవికి రాజీనామా చేయడంతో ఆయన స్థానంలో నిజామాబాద్ జిల్లా వేల్పూర్ కు చెందిన కుంట రమేష్ రెడ్డి ఎన్నికయ్యారు. ఈ లెక్కన కామారెడ్డి జిల్లాకు డీసీఎంఎస్ చైర్మన్ పదవి దక్కడం ఆనవాయితీ. అయితే ఇద్దరు డైరెక్టర్లు పోటీ పడుతుండడంతో సోమవారం ఐడీసీఎంఎస్ కార్యాలయంలో ఎన్నిక నిర్వాహణకు ఏర్పాట్లు చేశారు. కాంగ్రెస్ అగ్రనేతల ఆశీస్సులు ఉన్న వారికి చైర్మన్ పదవి దక్కడం ఖాయం.

ChairmanChairman electionsCooperative SocietyIDCMSIDCMS Chairman electionsIndore District
Comments (0)
Add Comment