- తెల్లవారుజాము నుండి క్షేత్రస్థాయిలో తిరుగుతూ పారిశుద్ధ్యం పై దృష్టి
- ఐఏఎస్ అధికారి మున్సిపల్ కమిషనర్ మంద మకరంద్ పై బతుకమ్మ ప్రత్యేక కథనం
బతుకమ్మ నిజామాబాద్ సిటీ : అయినా రూటే సపరేటు పారిశుద్ధ్యం లోపిస్తే ఎంతటి వారైనా సరే ఉపేక్షించకుండా చర్యలకు ఉపక్రమిస్తున్నారు. నిజామాబాద్ మున్సిపల్ కమిషనర్ మంద మకరంద తెల్లవారుజామున 5 గంటల నుండి వివిధ డివిజన్లో ని అధికారులను వెంటవేసుకొని పని పనిచేయని అధికారులు, మున్సిపల్ సిబ్బంది జవాన్లలో దడ పుట్టిస్తున్నారు ఒక ఐఏఎస్ అధికారి అయి ఉండి వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో సమయానికి హాజరుకాని సామాన్య ప్రభుత్వ అధికారులు కూడా ఈయనను చూసి సమయపాలన పాటించాలని వారిలో వారు అనుకుంటున్నారు. కానీ ఈయన మాత్రం తెల్లవారుజామున ఉదయం 5 నుంచి క్షేత్రస్థాయిలో తిరుగుతూ పారిశుద్ధ్య సమస్యలు ఉన్న గుర్తిస్తూ, ఆ ప్రాంత జవాన్లు, మున్సిపల్ కార్మికులకు వెంట వెంటనే ఆదేశాలిస్తూ అందరి చేత శభాష్ అనిపించుకుంటున్నాడు ఈ యువ ఐఏఎస్ మున్సిపల్ కమిషనర్ 5 గంటల నుంచి రోజంతా వివిధ మునిసిపల్ పారిశుద్ధ్య, క్షేత్రస్థాయిలో పర్యటిస్తూనే ఉంటూ ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. సాయంత్రం వేళలు మాత్రం మున్సిపల్ కార్యాలయంలోనే ఉండి ఏదైనా సమస్య కోసం వచ్చిన వారి సమస్యలను ఓపికగా వింటూ సమస్యల పరిష్కారం చూపిస్తున్నారు.