ఇటు వాన జోరు.. అటు దొంగల జోరు

బతుకమ్మ, నిజామాబాద్ క్రైం : నిజామాబాద్ జిల్లాలో జోరుగా వర్షం పడుతుండగా దొంగలు మాత్రం ఎమాత్రం జంకకుండా చోరీ చేశారు. నిజామాబాద్ నగరంలోని ఐదవ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బ్యాంక్ కాలనీలో సోమవారం రాత్రి శ్రీనివాస్ అను వ్యక్తి ఇంటిలో చోరీకి పాల్పడ్డారు. శ్రీనివాస్ కుటుంబ సమేతంగా హైద్రాబాద్ వెల్లగా సోమవారం రాత్రి అతని ఇంటి తాలాలు పగుల గోట్టి. బెడ్ రూంలోని బీరువాను ద్వంసం చేసి అందులోని 10 తులాల బంగారు అభరణాలు, లక్ష నగదును ఎత్తుకుపోయారు. మంగళవారం ఉదయం ఇంటికి చేరుకున్న శ్రీనివాస్ ఇంటి తలుపులు తెరిచి ఉండగ పోలిస్ లకు సమాచారం ఇవ్వడంతో చోరీ సంఘటన వెలుగు చూసింది. ఈ మేరకు ఐదో టౌన్ పోలిస్ లు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Here is the rush of rain.. there is the rush of thieves
Comments (0)
Add Comment