బతుకమ్మ, మోర్తాడ్
మోర్తాడ్ మండలం షెట్ పల్లి గ్రామంలో మంగళవారం హెల్త్ క్యాంప్ నిర్వహించారు. హెల్త్ క్యాంప్ లో వైరల్ ఫీవర్, మలేరియా, డెంగ్యూ, బిపి, షుగర్ తదితర వ్యాధులకు సంబంధించిన రక్త పరీక్షలు నిర్వహించినట్లు ఆరోగ్య సిబ్బంది సద్గుణ తెలిపారు. వర్షాకాలం కావడంతో వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత పై ప్రత్యేక దృష్టి ఉంచాలని అపరిశుభ్రంగా ఉంటే వ్యాధుల భారిన పడతారని స్థానికులకు అవగాహన కల్పించారు. అవగాహన కార్యక్రమంలో పంచాయితీ కార్యదర్శి ప్రశాంత్, ఆరోగ్య సిబ్బంది లావణ్య, దీపా ఆశ వర్కర్లు శ్యామల, లత, సరిత, అంగన్ వాడి టీచర్ ఇందిరా పాల్గొన్నారు.