బతుకమ్మ నిజామాబాద్ క్రైం: మహారాష్ర్టలోని నాందెడ్ కు తరలిస్తున్న నిషేధిత గుట్కాను జిల్లా కేంద్రంలో బుధవార అర్ధరాత్రి పోలీసులు పట్టుకున్నారు. టూ టౌన్ పోలీసులు ఆర్ ఆర్ చౌరస్తాలో వాహనాలను తనిఖీ చేస్తుండగా ఓ ఎర్టిగా కారులో తరలిస్తున్న 20 బ్యాగుల గుట్కా పట్టుబడింది. గుట్కా తరలిస్తున్న అంకుశ్ జాదల్ వార్, శివాజీ గైక్వాడ్ ను పోలీసులు పట్టుకున్నారు. నిజామాబాద్ కు చెందిన సుల్తాన్ దగ్గర నాందేడ్ కు చెందిన శుభం అనే వ్యక్తి గుట్కా కొని తరలిస్తుండగా ఇద్దరు పట్టుబడ్డారు. పట్టుబడిన గుట్కా విలువ రూ.లక్షా 20వేలు ఉంటుందని, నలుగురిపై కేసు నమోదు చేశామని ఎస్సై యాసర్ అరాఫత్ తెలిపారు.