బతుకమ్మ మోర్తాడు – తల్లిదండ్రులు జన్మనిస్తే ఉపాధ్యాయులు జీవితాన్ని ఇస్తారని ఇంచార్జ్ ప్రిన్సిపాల్ మర్రిపల్లి భూపతి అన్నారు. గురువారం మోర్తాడ్ డిగ్రీ కళాశాలలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ టి పెద్దన్న కు రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు రావడం సంతోషకరమైన విషయమని వారికి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో రాజనీతి శాస్త్ర అసిస్టెంట్ ప్రొఫెసర్ టి. రవీందర్, సీనియర్ అధ్యాపకులు రాజయ్య, దశరథ్, బ్యుల, అవంతి, అశోక్, పద్మ,స్రవంతి, పూజ, సిబ్బంది అశోక్, గంగారం, బజన్న, సోని, రాణి,పుష్ప, గీత తదితరులు పాల్గొన్నారు.