రిజిస్ట్రేషన్ నుంచి ప్రభుత్వ భూమిని తొలగించాలి

బతుకమ్మ, నిజామాబాద్ : ప్రభుత్వ భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్న యంచ మాజీ సర్పంచ్ భర్త పేరును రిజిస్ట్రేషన్ నుంచి తొలగించాలని కోరుతు గ్రామస్తులు ఆర్డీఓ రాజేందర్ కు పిర్యాదు చేశారు. నవీపేట్ మండలం లోని యంచ మాజీ సర్పంచ్ కొట్టారి లహరి భర్త ప్రవీణ్ 1994 -1995సంవత్సరం లోసర్వే నెంబర్ 27/ఆ /3లో భూమిని తన పేరుపై అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారని గ్రామస్తులు ఆరోపించారు. రాజీవ్ గాంధీ వాటర్ స్కీమ్ కొరకు ప్రభుత్వం అప్పట్లో కొనుగోలు చేసిందని అప్పటి నుండి పహాణి కాని ఎలాంటి రికార్డులు లేవన్నారు. కాని నవీపేట్ తహసీల్దార్ 23జులై 2024న అందులోంచి 5గుంటల భూమిని మాజీ సర్పంచ్ భర్త పేరు మీద రిజిస్ట్రేషన్ చేశారని ఆ రిజిస్ట్రేషన్ రద్దు చేయాలని కోరారు. అక్రమంగా ప్రభుత్వ భూమిని రిజిస్ట్రేషన్ చేసిన తహసీల్దార్ పై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు ఆర్డీఓ ను కోరారు.ఈ విషయం పై తహసీల్దార్ నారాయణ ను వివరణ కోరగా గత సంవత్సరం అప్పటి తహసీల్దార్ కు మిస్సింగ్ సర్వే నెంబర్ లో అప్లికేషన్ పెట్టుకో అప్పట్లోనే ఆర్ ఐ తహసీల్దార్ పంచానమ చేశారని మిస్సింగ్ ఆప్షన్ ఇప్పుడు రావడంతో పై ఒకే చేయడం జరిగిందన్నారు.

Government land should be removed from registration
Comments (0)
Add Comment