- . . . కామారెడ్డిలో నాలుగు కేసులు కొలిక్కి
- . . . బంగారం, నగదు, బైక్ స్వాధీనం
- బతుకమ్మ, కామారెడ్డి
కామారెడ్డి పట్టణంలో, రూరల్ ప్రాంతంలో చోరిలకు పాల్పడిన ఘరానా దొంగను అరెస్టు చేసినట్లు కామారెడ్డి రూరల్ సిఐ రామన్ తెలిపారు. మంగళవారం దేవుని పల్లి పోలిస్ స్టేషన్ లో ఎర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో హైద్రాబాద్ చుట్టు ప్రక్కల ప్రాంతంలో 102 చోరీలకు పాల్పడిన ఘరానా దోంగను అరెస్టు చేసిన వివరాలను వెల్లడించారు. రూరల్ సిఐ కథన ప్రకారం.ఈ నెల 17న దేవునిపల్లి పోలీస్ స్టేషన్ లో పరిధిలో గోష్క రాజయ్య కాలనీకి చెందిన రిటైర్డ్ ఆర్టీసీ ఇంజమూరి రాములు తన ఇంట్లో దొంగతనం జరిగిందని ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి కామారెడ్డి ఎస్పీ ఆదేశాల మేరకు డీఎస్పీ ఉత్తర్వుల ప్రకారం కామారెడ్డి రూరల్ సిఐ ఆధ్వర్యంలో రెండు టీంలుగా ఏర్పడ్డారు. ఇదే క్రమంలో నర్సన్నపల్లి గ్రామ శివారులో వాహనాలు తనిఖీ చేస్తుండగా అనుమానాస్పద రీతిలో ఓ వ్యక్తి కనిపిస్తే అతన్ని పట్టుకుని విచారించగా నిందితుడు మీర్ కజామ్ ఆలీ ఖాన్ ఆలియాస్ కాజు ఆలియాస్ సూర్యభాయ్ టోలిచౌక్ హైదరాబాద్ గా తెలిపాడన్నారు. కామారెడ్డి పీఎస్ పరిధిలోని బైక్ దొంగతనం, దేవునిపల్లి పీఎస్ పరిధిలోని గోష్క రాజయ్యకాలనీలో ఇంట్లో బంగారం, నగదు దొంగతనం చేసిన నేరాలను ఒప్పుకున్నాడని, వాటిని దాచిపెట్టిన చోటికి తీసుకెళ్లగా వాటిని స్వాధీనం చేసుకున్నట్లు సిఐ తెలిపారు. మూడున్నర తులాల బంగారం గొలుసు, 1.2 తులాల బంగారం గొలుసు, ఆకుపచ్చ రాయి ఉన్న బంగారం 6 గ్రాములు, 3 ఉంగరాలు 1.2 గ్రాములు, బైక్ ఏపీ 25 కె 9842 ను స్వాధీనం చేసుకోగా వాటి విలువ 1,43,000గా ఉంటుందన్నారు. నిందితుడు మీర్ కజామ్ ఆలీ ఖాన్ పై హైదరాబాద్ కమిషనరేట్ లో, సంగారెడ్డి జిల్లా పరిధిలో అన్ని కలిపి 102 కేసులు నమోదయ్యాయన్నారు. నిందితుడిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చగా రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు. నేరస్తున్ని పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన దేవునిపల్లి ఎస్సై రాజు, ఎస్సై 2 మధుసుదన్ రెడ్డి, క్రైం కానిస్టేబుల్ రామస్వామి, బాలక`ష్ణ, హోంగార్డు రాజు, టెక్నికల్ సిబ్బంది రోహిత్, శ్రీనులను కామారెడ్డి డీఎస్పీ అభినందించారు.