ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడం అభినందనీయం

  • పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్

బతుకమ్మ, నిజామాబాద్ : చదువులో రాణిస్తూ అత్యుత్తమ మార్కులు సాధించడం, ప్రభుత్వ ఉద్యోగాలకు ఎన్నిక కావడం ఎంత అభినందనీయమని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ అన్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్న వారి పిల్లలు నీటిలో సీట్లు సాధించి అలాగే ప్రభుత్వ ఉద్యోగాలు పొందిన వారిని స్థానిక కమిషనర్ కార్యాలయంలో మంగళవారం ఆయన సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు విధి నిర్వహణలో ఎల్లప్పుడూ ఉండటం వల్ల సిబ్బందికి తంబాలపై శ్రద్ధ చూపేందుకు సమయం ఉండదన్నారు. అయినా ఈ లోటును అధిగమించి తమ సిబ్బంది పిల్లలు ఈ ఘనతను సాధించడం ఎంత అభినందనీయం అని అన్నారు ఇదే విధంగా మిగతా సిబ్బంది పిల్ల కూడా వీరిని స్ఫూర్తిగా తీసుకొని తల్లిదండ్రుల కష్టాలకు సార్ధకత తేవాలని సూచించారు. నీట్ పరీక్షలో ఐదో తారీకు చెందిన కానిస్టేబుల్ మోహన్ కుమార్తె లాస్య 720 మార్కులకు గాను 603 మార్కులు సాధించిన ంచిన తెలిపారు. మూడో తారీకు చెందిన కానిస్టేబుల్ రఘు వర్ధన్ కుమార్తె స్నేహల్ 720 మార్కులకు గాను 578 సాధించిందని పేర్కొన్నారు. అలాగే సిసిఎస్ కానిస్టేబుల్ కేర్ బాజీ కుమార్తె మౌన 720 మార్కులకు 539 మార్కులు సాధించిందని తెలిపారు. ఒకేసారి ఐదు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన ఎస్ ఐ బి హెడ్ కానిస్టేబుల్ కుమార్తె కావేరియం ఈ సందర్భంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీ బి
.కోటేశ్వరరావు, ఆర్మూర్ రిజర్వ్ ఏసీబీ నాగయ్య, పోలీస్ అసోసియేషన్ అధ్యక్షులు షకీల్ పాషా, సిబ్బంది కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Getting government jobs is commendable
Comments (0)
Add Comment