- నిజామాబాద్ సౌత్ సీఐ సురేష్ కుమార్
బతుకమ్మ , నిజామాబాద్ అర్బన్ : గణేష్ నవరాత్రి ఉత్సవాలు శాంతియుతంగా నిర్వహించుకోవాలని నిజామాబాద్ సౌత్ సీఐ సురేష్ కుమార్ నిజామాబాద్ ఆరవ పోలీస్ స్టేషన్లో శాంతి కమిటీ సమావేశం మంగళవారం నిర్వహించారు. గణేష్ మండపాల వద్ద తగు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆరవ టౌన్ ఎస్ఐ వెంకట్రావు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.