నిజామాబాద్ జిల్లాలో కుండపోత

. . . రెండుగంటల్లో దంచికోట్టిన వాన

  . . .అత్యధికంగా భీంగల్ లో 10 సెంటిమీటర్లు

. . . అత్యల్పంగా పెర్కిట్ లో 0.5 మిల్లీ మీటర్లు

బతుకమ్మ, నిజామాబాద్:

నిజామాబాద్ జిల్లాలో సోమవారం కుండపోత వర్షం కురిసింది. మద్యహ్నం కేవలం రెండుగంటల సమయంలోను బారీ వాన పడింది. చాల రోజుల తరువాత బారీ వర్షం కురియడంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. అత్యధికంగా భీంగల్ లో 10 సెంటిమీటర్ల వర్షం పడింది. నిజామాబాద్ నగరంలోని సౌత్ మండలంలో 83.5 మిల్లీ మీటర్లు, ఉత్తర మండలంలో 73.3, కమ్మర్ పల్లి మండలం కోన సముందర్ లో 61.3 నిజామాబాద్ నార్త్ లో 59.5, మెండోరాలో 46.0, బోదన్ మండలం బెల్లాల్ లో 45.3, ఎడపల్లిలో 41.3, ఎడపల్లి మండలం జానకం పేట్ లో 36.5 నందిపేట్ మండలం సిహెచ్ కోండూర్ లో 29.0 ఇందల్వాయి గన్నారంలో 28.0, బాల్కోండలో 22, మదన్ పల్లి, నవిపేట్,జక్రాన్ పల్లి, ఎర్గట్ల, మంచిప్ప, వెల్పూర్, తోండాకుర్ లలో 1 సెంటి మీటర్ల నుంచి ఓకటిన్నర సెంటిమీటర్ల వర్షం కురిసింది. అత్యల్పంగా పెర్కిట్, నిజామాబాద్ రూరల్ మండలం పాల్ధ లో 0.5 మిల్లీ మీటర్లు వాన కురిసింది.

 

Flood in Nizamabad district
Comments (0)
Add Comment