బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం

బతుకమ్మ,(ముప్కాల్) మోర్తాడ్:  ము ముప్కల్ మండల కేంద్రానికి చెందిన కంచు రాము కరోనా సమయంలో మరణించడం జరిగింది. ఈమధ్యనే ఆయన భార్య గుండెపోటుతో మరణించడం వల్ల ఇద్దరు కూతుర్లు అనాధలయ్యారు. విషయం తెలుసుకున్న రాము చిన్ననాటి క్లాసుమెట్లు బుధవారం వారి ఇంటికి వెళ్లి కూతుర్లు ఆకృతి,లాయకృతి లను పరామర్శించి ఓదార్చారు. అనంతరం 85000 ల రూపాయలను అందజేశారు. వారికి రాము చిన్న నాటి మిత్రులు అందరు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.ఈకార్యక్రమంలో ముప్కాల్ 1992-93 పదవతరగతి బ్యాచ్ మిత్రులు ఓ.రమేష్, ఎం.దయానంద్, ఏ.ఆనంద్ గౌడ్,లోక ముత్యం, మార మనోహర్ రాజశేఖర్,కె.రమేష్,భూమేశ్ మరియు రాంరాజు ఉమేష్ లు పాల్గొన్నారు.

Financial assistance to the affected family
Comments (0)
Add Comment