బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం

బతుకమ్మ, రామారెడ్డి : మండలంలోని అన్నారం గ్రామంలో గత రెండు రోజులుగా కురిసిన భారీ వర్షాలకు కీసరి రాజేశం ఇల్లు కూలిపోయిందన్న విషయం తెలుసుకున్న మండల కామారెడ్డి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మద్దికుంట నర్సాగౌడ్, మైనారిటీ సెల్ జిల్లా నాయకులు ఎండీ సల్మాన్ బాధిత కుటుంబాల ఇళ్లను బుధవారం పరిశీలించారు.  వారిని పరామర్శించి ప్రభుత్వ పాఠశాలలో తాత్కాలికంగా ఆశ్రయం కల్పించారు. వారికి బియ్యం, కొంత నగదును అందజేశారు. ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ సూచనలతో సాయం అందజేశారు.  ప్రభుత్వం తరుపున ఆదుకుంటామని తెలిపారు.అలాగే గ్రామం లోని ఉమామహేశ్వర స్వామి ఆలయానికి మైక్ సెట్ కూడా ఇప్పించినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు గంగారెడ్డి, దయానంద్, చాకలి బాలయ్య, బలరాం నమీలే రాజు, చాకలి శ్రీను, కుమ్మరి బాలరాజ్. డీలర్ గోపాల్,కీసరి లింగం తదితరులు పాల్గొన్నారు.

Financial assistance to the affected family
Comments (0)
Add Comment