బతుకమ్మ, బోధన్ : నవీపేట్ మండల కేంద్రంలోని దర్యపూర్ కాలోని కి చెందిన నిరుపేద మహిళ అంత్యక్రియలకు మీ కోసం మేము అనే సేవాసంస్థ ఆర్థిక సహాయం చేసింది. బిక్షటన చేస్తూ జీవించె స్వప్న అనే మహిళ అనారోగ్యంతో బాధపడుతూ బుధవారం నాడు మరణించడంతో అంత్యక్రియలకు నవీపేట్ కు చెందిన మీ కోసం మేము , అనే సేవా సంస్థకు చెందిన సభ్యులు బీమార్తి మోహన్, సుంకరి మహిపాల్ లు 8 వేల రూపాయల ఆర్దిక సహాయాన్ని కుటుంబ సభ్యులకు అందజేశారు.