బతుకమ్మ, మోర్తాడ్: ప్రజలు శాంతియుత వాతావరణంలో గణేష్ ఉత్సవాలు జరుపుకోవాలని మోర్తాడ్ ఎస్సై విక్రమ్ తెలిపారు. మోర్తాడ్ మండలంలోని దొన్ కాల్, ధర్మోరా, శేట్ పల్లీ గ్రామాల్లో ఏర్పాటు చేసిన గణేష్ మండపాలను ఆయన ఆదివారం దర్శించారు. ప్రతి గ్రామంలో ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో బడే నరేందర్,రంగుశ్రీకంత్,పుప్పలగంగనర్సయ్య , రాడే కిసాన్,బబ్లూ గ్రామాల యువజన నాయకులు తదితరులు పాల్గొన్నారు.