బతుకమ్మ, మెండోరా: మెండోర మండలం శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ గోదావరి నదిలో ఆదివారం ఫిరోజ్ అనే వ్యక్తి గల్లంతైన విషయం తెలిసిందే. ముంబైకి చెందిన ఫిరోజ్ జగిత్యాల జిల్లా మెట్పల్లి చెందిన తన మిత్రుల ఇంటికి వచ్చి ఆదివారం శ్రీరాంసాగర్ ప్రాజెక్టు సందర్శించేందుకు వెళ్లి పొరపాటున గోదావరి నదిలో పడి కొట్టుకొని పోయాడు. సోమవారం రోజు నీటి ప్రవాహం తగ్గడంతో ఫిరోజ్ మృతదేహం పోలీసులు గుర్తించారు.