బతుకమ్మ, బిచ్కుంద :
కామారెడ్డి జిల్లాలో రైతులు రోడేక్కారు. ఇటివల కురిసిన బారీ వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతులను అదుకోవాలని దర్నా నిర్వహించారు. ఇటీవల కురిసిన వర్షాలతో మొక్కజొన్న, సోయా, కంది, పత్తి తదితర పంటలు నీట మునిగాయని పెద కోడప్ గల్ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. బుదవారం పెద్ధ కోడప్ గల్ మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. వెంటనే రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని ప్రభుత్వం ఆదుకోకపోతే కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి ఉందని అన్నారు. బాధితులకు నష్ట పరిహరం పై ప్రకటన చేసి తక్షణమే ప్రభుత్వం స్పందించి చర్యలు చేపట్ట లేనట్లయితే తమ భవిష్యత్ కార్యక్రమం ప్రకటిస్తామని రైతులు హెచ్చరించారు.