బతుకమ్మ, బాన్సువాడ: కరెంటు తీగలు తగిలి రైతు దుర్మరణం చెందారు. ఈ సంఘటన వర్ని మండలం జలాల్పూర్ గ్రామానికి చెందిన వడ్డే వెంకన్న(54) గురువారం సాయంత్రం పోలానికి వెళ్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్తు తీగలు తగిలి మృతి చెందినట్లు వర్ని ఎస్సై కృష్ణ తెలిపారు. వర్షం, ఈదురు గాలులకు విద్యుత్ తీగలు తెగి పొలంలో పడిపోయాయి. రైతు గమనించక తీగలకు తగలడంతో విద్యుత్ షాక్ తో అక్కడికక్కడే మృతి చెందారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.