- ఎం పీఓ ముందు ఒప్పుకున్న ఘనులు
- వెంటనే జీ పి అకౌంట్లో జమా చేయాలని ఆదేశించిన ఎంపీఓ
బతుకమ్మ, భీంగల్ : పేదలకు మరగుదొడ్లు కట్టుకోవడానికి డబ్బులు లేకుంటే ప్రభుత్వం ద్వారా ఆర్ధిక సహాయంను అందించేలా చూడాల్సిన ప్రజాప్రతినిధులే వారి పాలిట శాపంలా మారి ప్రభుత్వం ఇచ్చిన ఆర్థిక సహాయం ను మాయం చేసిన ఘటన భీంగల్ మండలం దేవక్కపేట గ్రామ పంచాయతీ లో చోటు చేసుకోంది.వివరాల్లోకి వెళితే దేవక్కపేట గ్రామం లో ఐ.హెచ్.ఎల్ సెంట్రల్ స్కిం కింద 13 మంది లబ్ధిదారులు మరుగుదొడ్లను నిర్మించుకొన్నారు. వారికి ఐ హెచ్ ఎల్ స్కీమ్ కింద కేంద్రం గ్రామ పంచాయతీ ఖాతాలోకి డబ్బులు వేయగా వాటి లబ్ధిదారులను పీల్చి ప్రభుత్వం ఇచ్చిన డబ్బులు చెక్ వ్రాసి ఇవ్వాలి. కాగా స్థానిక సర్పంచ్, చెక్ పవర్ ఉన్న ఉపసర్పంచ్ తో కుమ్ముక్కయి సెక్రటరీ ప్రమేయం లేకుండా డబ్బులను డ్రా చేశారు. డ్రా చేసిన రూ. 1,60,000 లను సర్పంచ్ రూ. 80వేలు, ఉపసర్పంచ్ రూ. 80వేలు పంచుకొన్నారు.ఈ విషయమై భాధిత లబ్ధిదారులు విషయాన్ని తెలుసుకొని మండలం ఆఫీస్ లో ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు ఏంపీడీఓ మండల పరిషత్ ఆఫీసర్ ను ఎంక్వరీకీ పంపించారు. స్థానిక సెక్రటరీ ప్రమేయం లేకుండా జరిగిన ఈ ఘటనపై ఎం పీ ఓ విచారణ చేపట్టగా విచారణలో తామే వాడుకున్నట్లు సదరు తాజా, మాజీ సర్పంచ్, ఉపసర్పంచ్ లు ఒప్పుకున్నారు. దాంతో ఆగ్రహించిన ఎంపీఓడ్రా చేసిన డబ్బులు యాదవిధిగా జీ. పీ ఖాతాలో వెయ్యాలని, వేసిన వెంటనే లబ్ధిదారులకు డబ్బులు చెల్లించాలని, లేని పక్షంలో క్రిమినల్ కేసు అవుతుందని హెచ్చరించి, ఆదేశించారు. దాంతో ఆ డబ్బులు మాయం చేసిన ఘనులు వాడుకొన్న రూ. 1 లక్ష 60 వేలు జీ. పీ ఖాతాలో జమా చేశారు.