బంగ్లాదేశ్ ఆకృత్యాలను ప్రతి హిందువు ఖండించాలి

  • అర్బన్ ఎమ్మెల్యే సూర్యనారాయణ గుప్తా

బతుకమ్మ నిజామాబాద్ అర్బన్ : బంగ్లాదేశ్ దేశంలో హిందూ ఆడబిడ్డలపై, హిందూ దేవాలయాల పైన జరుగుతున్న మారణకాండకు నిరసనగా నిజామాబాద్ హిందూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం భారీ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనారాయణ గుప్త ముఖ్య అతిథిగా హాజరై ర్యాలీలో పాల్గొన్నారు. శివాజీ నగర్ లోని ఆర్ఆర్ చౌరస్తా నుండి గాంధీ చౌక్ వరకు భారీ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో హిందుత్వవాదులు బంగ్లాదేశ్ లో ఆడపడుచులపై జరుగుతున్న ఆకృత్యాలకు మద్దతుగా ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బంగ్లాదేశ్లో హిందూ ఆడబిడ్డల పైన, హిందూ దేవాలయాల పైన జరుగుతున్న మరణకాండకు నిరసనగా హిందుత్వ వాదులందరినీ ఏకతాటిపై తెచ్చేందుకు ఈ భారీ కొవ్వొత్తుల ర్యాలీ అందరి సహకారంతో నిర్వహించడం జరుగుతుందన్నారు. దేశం ఏదేదైనాప్పటికీ హిందువులపై దాడి జరిగిందంటే మన అందరిపై జరిగిందన్నట్టేనని వారందరికీ మద్దతుగా కుల మతాలకతీతంగా ప్రతి ఒక్కరం ఈ మరణకాండను, హిందూ ఆలయాల పై జరుగుతున్న దాడులను ప్రతి ఒక్కరూ ఖండించి అక్కడ దాడులకు పాల్పడుతున్న హిందూ వ్యతిరేక వాదులకు సరైన గుణపాఠం చెప్పాలని ఆయన అన్నారు. కాగా జైశ్రీరామ్ జైశ్రీరామ్ అనే నినాదాలతో మార్మోగింది. కార్యక్రమంలో కార్పొరేటర్లు న్యాలం రాజు, సాయి వర్ధన్, కిషోర్, రాఘవేందర్, విహెచ్పి నాయకులు దాత్రిక రమేష్, బిజెపి మహిళా మోర్చా నాయకురాలు, వివిధ మహిళా సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Every Hindu should condemn Bangladesh's atrocities
Comments (0)
Add Comment