చికిత్స పొందుతూ వృద్ధురాలు మృతి

బతుకమ్మ, నిజామాబాద్ క్రైమ్ : రోడ్డు ప్రమాదం లో గాయపడిన వృద్ధురాలు చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందినట్లు ఒకటో టౌన్ ఎస్ హెచ్ ఓ విజయ్ బాబు తెలిపారు. సీతారాం నగర్ కు చెందిన భూ లక్మి అనే వృదురాలును ఆర్ టీ సీ డిపో -1 వెనుక మంగళవారం వేగంగా వచ్చిన కారు ఢీ కొట్టిందని అన్నారు. చికిత్స నిమిత్తం ఆమెను నగరం లోని ఆసుపత్రి కి తరలించారని తెలిపారు. పరిస్థితి విషమించి ఆమె మృతి చెందిందని అన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Elderly woman died while receiving treatment
Comments (0)
Add Comment