బతుకమ్మ, నిజామాబాద్ క్రైమ్ : రోడ్డు ప్రమాదం లో గాయపడిన వృద్ధురాలు చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందినట్లు ఒకటో టౌన్ ఎస్ హెచ్ ఓ విజయ్ బాబు తెలిపారు. సీతారాం నగర్ కు చెందిన భూ లక్మి అనే వృదురాలును ఆర్ టీ సీ డిపో -1 వెనుక మంగళవారం వేగంగా వచ్చిన కారు ఢీ కొట్టిందని అన్నారు. చికిత్స నిమిత్తం ఆమెను నగరం లోని ఆసుపత్రి కి తరలించారని తెలిపారు. పరిస్థితి విషమించి ఆమె మృతి చెందిందని అన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.