ఇళ్లు లేని నిరుపేదలు రుద్రూర్ లో డబుల్ బెడ్ రూం ఇళ్లను కబ్జా చేశారు. తమ గోడును నాయకులు, అధికారులకు వెల్లబోసుకున్నా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. డబుల్ బెడ్ రూం ఇళ్లు నిర్మించి ఏడాదైనా తమకు కేటాయించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాయకులు ఇచ్చేది ఎప్పుడు? మేము తీసుకునేది ఎప్పుడు? అని.. అందుకే తామే ఇళ్లలోకి వచ్చేశామని అన్నారు. డబుల్ బెడ్ రూం ఇళ్లను కబ్జా చేసిన పేదలు ఇళ్ల ముందు తమ పేర్లను రాయించుకున్నారు.
Related