సైబర్ నేరగాళ్ల వలలో పడవద్దు

  • మాచారెడ్డి ఎస్ఐ అనిల్

బతుకమ్మ, మాచారెడ్డి:  సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడి తమ కష్టార్జితాన్ని కరిగిపోకుండా జాగ్రత్త పడాలని మాచారెడ్డి ఎస్ఐ అనిల్ సూచించారు. పాల్వంచ మర్రి వద్ద మండల ప్రజలకు వివిధ అంశాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. సైబర్ నేరగాళ్లకు చిక్కకుండా పలు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయినట్టు అనుమానం వచ్చిన వెంటనే 1930 కి డయల్ చేసి ఫిర్యాదు చేయాలన్నారు. ఎమర్జెన్సీ సమయంలో 100 డయల్ చేసి సహాయం పొందాలన్నారు. మహిళలకు భద్రత కల్పించడం ప్రభుత్వ బాధ్యత. మహిళల రక్షణకు షీటీం లను ఆశ్రయించాలని వివరించారు. రోడ్డు భద్రత నియమాలు పాటించి ప్రమాదాలను నివారించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాచారెడ్డి పోలీస్ సిబ్బంది స్థానికులు పాల్గొన్నారు.

Don't fall into the trap of cyber criminals
Comments (0)
Add Comment