బతుకమ్మ, నిజామాబాద్ అర్బన్ : తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్ గా నియమితులైన బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ను నిజామాబాద్ కాంగ్రెస్ నాయకులు సోమవారం మర్యాద పూర్వకంగా కలిశారు. రాజధానిలోని ఆయన స్వగృహంలో కలిసి పుష్ప గుచాన్ని ఇచ్చి, శాలువతో సత్కరించారు. మహేష్ గౌడ్ కు జిల్లా కాంగ్రెస్ నాయకులు శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమం లోజిల్లాకాంగ్రెస్ నాయకులు లవంగం ప్రమోద్, రాబిన్ సింగ్, విశాల్, అతిమల చింటూ , శ్రీకాంత్ యాదవ్ లు పాల్గొన్నారు.