బతుకమ్మ, పిట్లం : పిట్లం మండలం లోని బాలుర ఉన్నత పాఠశాలలోని విద్యార్థులకు గురువారం క్రీడా దుస్తులు పంపిణీ చేశారు. 1909-10 సంవత్సర పూర్వ విద్యార్థుల ఆధ్వర్యం లో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రీడల సమయం లో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని తమ దృష్టికి వచ్చిందన్నారు. అందువల్ల తామంతా ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఏమైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకొస్తే పరిష్కరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వెంకీ, అద్నాన్, జియా, సుధాకర్, నవీన్, జోలక్, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.