బతుకమ్మ, బోధన్ : నవీపేట్ మండలం నాలేశ్వర్ గ్రామ ప్రాథమిక పాఠశాలకు కొండగట్టు ఆలయ పూజారి జై క్రిష్ణా సోమవారం రూ. 30 వేల విలువ చేసే సౌండ్ బాక్స్ లను స్కూల్ ప్రదానోపాధ్యాయునికి అందజేశారు. ఈ సందర్భంగా పూజారి జైక్రిష్ణ కు ఉపాధ్యాయ బృందం ధన్యవాదాలు తెలిపారు. స్కూల్ అభివృద్ధి కొరకు తనవంతుగా సహాయం చేసిన పూజరికి నాలేశ్వర్ గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో శాలువా తో సత్కరించారు. ఈ కార్యక్రమంలో బినోల సొసైటీ చైర్మన్ మగ్గరి హన్మాండ్లు, నాలేశ్వర్ మాజీ సర్పంచ్ సరిన్, వీడిసి సభ్యులు సురేష్, స్వామి, రాజేశ్వర్, మోహన్, మరియు పాఠశాల ఉపాద్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.