విద్యార్థులకు స్కూల్ బ్యాగ్స్ నోటు బుక్స్ పంపిణీ.
బతుకమ్మ , నిజామాబాద్ సిటి : మామిడిపల్లి లోని తపస్వి సోషల్ ఆర్గనైజేషన్ లోని అనాథ పిల్లలకు జేసిఐ అల్యుమ్ని క్లబ్ ఆధ్వర్యంలో దాతలు 1995 బ్యాచ్ కానిస్టేబుల్స్ , హెచ్ 2ఓ ఇండియా సభ్యులు గుండు నరేష్ అందించిన స్కూల్ బ్యాగ్స్ , లయన్ సుజాత సూర్యారాజ్ అందించిన నోట్ బుక్స్ తపస్వి పిల్లలకు అందచేశారు. జేఏసీ చైర్మన్ జివిఎన్ రాజు, హెచ్ 2ఓ యూఎస్ఏ అధ్యక్షురాలు శ్రీలత కోరాడ దాతలను అభినందించారు. తపస్వి కార్యదర్శి దిలీప్ ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమం లో హెచ్ 2ఓ ఇండియా కోఆర్డినేటర్ విజయానంద్, డైరెక్టర్ లావణ్య సభ్యులు ప్రశాంత్, నయన్,తపస్వి సభ్యులు శ్రీనివాస్, కవిత ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.