పాలెం జడ్పిహెచ్ఎస్ పాఠశాలను సందర్శించిన డీఈవో

బతుకమ్మ మోర్తాడ్ : ప్రతి ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ పాఠశాలకు వచ్చేలా చూడాలని విద్యార్థుల సంఖ్య పెరిగేలా చూడాలని జిల్లా విద్యాధికారి దుర్గాప్రసాద్ అన్నారు. అమ్మ ఆదర్శ పాఠశాల లో జరుగుతున్న మంచినీటి పనులను త్వరలో పూర్తి చేయాలని తెలియజేశారు. గురువారం మోర్తాడ్ మండలంలోని పాలెం గ్రామంలో గల జడ్పీహెచ్ఎస్ పాఠశాలను ఆయన సందర్శించి జరుగుతున్న పనులను పర్యవేక్షించారు. వీలైనంత త్వరగా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. తరగతి గదిలో విద్యార్థులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. మధ్యాహ్న భోజనంను పరిశీలించారు. ఉపాధ్యాయుల హాజరు పట్టికల ను పరిశీలించారు. అనంతరం పాఠశాల సిబ్బంది విద్యాశాఖ అధికారిని శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు నరసింహస్వామి, చంద్రశేఖర్, రాజేందర్, జయశ్రీ, త్రివేణి, రాజేశ్వరితదితరులు పాల్గొన్నారు.

DEO visited Palem ZPHS School
Comments (0)
Add Comment