బాధిత కుటుంబాలకు పరామర్శ

బతుకమ్మ, భీమ్ గల్: మండలంలోని పచ్చల నడుకుడకు చెందిన కాంగ్రెస్ కార్యకర్త జాపిరి రమేశ్ సోదరుడు జాపిరి  మహేశ్ ఇటీవల మరణించగా బాధిత కుటుంబాన్ని తెలంగాణ స్టేట్ సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ సుంకెట అన్వేష్ రెడ్డి గురువారం పరామర్శించి రూ.25వేల ఆర్థికసాయం అందజేశారు. ఇటీవల మరణించిన ఆది సురేశ్ కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన వెంట వేల్పూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు గడ్డం నర్సారెడ్డి, కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడు గుడాల మోహన్, కిసాన్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు టక్కురి గంగాధర్, సొసైటీ డైరెక్టర్  గట్టవుతల నర్సారెడ్డి, లింగేశ్వర్, రెడ్ క్రాస్ సొసైటీ డివిజన్ మెంబర్ అంకన్న గారి రాజశేఖర్, నెహ్రూ, ఆది చిన్న ముత్తన్న, నోముల గంగాధర్, కాంగ్రెస్ కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

Counseling for affected families
Comments (0)
Add Comment