అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి
బతుకమ్మ పిట్లం : స్థానిక సంస్థల ఎన్నికల కొరకు ఓటర్ జాబితాలను త్వరగా పూర్తి చేయాలని పిట్లం తాసిల్దారును అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి ఆదేశించారు.అడిషనల్ కలెక్టర్ స్థానిక సంస్థలు కామారెడ్డి పిట్లమ్ మండలం సందర్శించి గ్రామపంచాయతీ వార్డు వారి ఓటర్ల జాబితా తయారీ అసెంబ్లీ ఓటర్ల జాబితాకు సంబంధించి పోలింగ్ స్టేషన్ వారీగా ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమం, ఎల్ఆర్ఎస్ సర్వే గురించి సమీక్షించారు. ఈ కార్యక్రమంలో మండల తహసిల్దార్ వేణుగోపాల్, ఎంపీడీవో కమలాకర్,ఎంపీవో యాదగిరి,మండల గిర్ధావార్ శీతల్ , తహసిల్ కార్యాలయం సిబ్బంది పాల్గొన్నారు.