పరిసరాలు శుభ్రపరచు.. ఆరోగ్యాన్ని మెరుగుపరచు

బతుకమ్మ, మోర్తాడ్: ఆగస్టు08: మన చుట్టూ ఉన్న పరిసరాలు శుభ్రంగా ఉంటే ప్రజల అందరి ఆరోగ్యం మెరుగ్గా ఉంటుందని మోర్తాడ్ ఎంపీడీవో తిరుమల దేవి అన్నారు. ” స్వచ్ఛదనం – పచ్చదనం” కార్యక్రమంలో భాగంగా గురువారం మోర్తాడ్ మండలంలోని డొంకల్, ధర్మోరా , శేట్ పల్లీ గ్రామాల్లో ఆమె పర్యటించారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం పరిసరాల పరిశుభ్రత కార్యక్రమాన్ని నిర్వహిస్తూన్న విషయం తెలిసిందే.

గ్రామాల్లో ని అంగన్వాడీ కేంద్రాలను, ప్రభుత్వ పాఠశాలను, ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల పరిసరాల శుభ్రం చేస్తున్న పనులను ఆమె పర్యవేక్షించారు. ఏటువంటి అపరిశుభ్రత కనిపించకుండా చెత్త చెదారం కానరకుండ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి అని తెలిపారు. కార్యక్రమంలో పంచాయితీ కార్యదర్శి ప్రశాంత్, ఫీల్డ్ అసిస్టెంట్లు చంద్రమోహన్, ప్రవీణ్, అంగన్వాడీ టీచర్లు, ఆశ వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.

 

Clean the surroundings.. Improve health
Comments (0)
Add Comment