బతుకమ్మ, బీర్కూర్ :కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలం బైరాపూర్ సహకార సొసైటీ చైర్మన్ రామకృష్ణ గౌడ్ అనారోగ్యంతో మృతి చెందారు. హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన బుధవారం తెల్లవారుజామున కన్నుమూశారు. రామకృష్ణ గౌడ్ కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. రామకృష్ణ గౌడ్ మృతికి బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఆగ్రో పరిశ్రమ చైర్మన్ కాసుల బాల్ రాజ్ గౌడ్ సంతాపం తెలిపారు.