బతుకమ్మ, బాల్కొండ : కల్వకుంట్ల కవితకు బెయిల్ మంజూరైన సందర్భంగా నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గo భీమ్గల్ పట్టణ కేంద్రం లో జాగృతి, BRS పార్టీ నాయకులు, పట్టణ కౌన్సిలర్ లు కార్యకర్తలు టపాకాయలు కాల్చి హర్షం వ్యక్తం చేసారు. కార్యక్రమంలో బాల్కొండ నియోజకవర్గ జాగృతి కన్వీనర్ జోగన్ పల్లి సతిష్ గౌడ్, జాగృతి మండల అధ్యక్షుడు జిందాం రాజేష్ (లడ్డు ), జాగృతి నాయకులు రంజిత్, మున్న, BRS పార్టీ కార్యకర్తలు, అభిమానులు తదితరుల పాల్గోన్నారు.