బతుకమ్మ, ఆర్మూర్ : నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా రక్షా బంధన్ వేడుకలు ఘనంగా జరిగాయి.జిల్లా లోని ఆర్మూరు పట్టణం లో సోమవారం రోజున రాఖీ పండుగ సందర్భంగా బస్ స్టాండ్ లో అక్క చెల్లెళ్ల తో పండగ వాతావరణం నెలకొంది.ఉదయం నుండే రాఖీలు అమ్మేవారు సైతం షాపులను తెరవడం ప్రజలు కొనుగోలు చేయడం జరిగినది.అన్నా చెల్లెళ్ల ప్రియమైన పండగగా రాఖీ పండగ అనేది ప్రతి సంవత్సరం ఘనంగా నిర్వహించుకుంటారు.ప్రతి అక్క చెల్లెలి కి అన్న ఒక ఆపద్భాందవుడు గా ఉండాలని కోరుకుంటూ ప్రతి సంవత్సరం రక్షా బంధన్ చేసుకోవడం జరుగుతుంది.