బతుకమ్మ, వేల్పూర్
వేల్పూర్ మండలం పడగల్ గ్రామానికి చెందిన బ్యాగరి బ్రిజేష్ మండల ఉత్తమ పీఈటీగా అవార్డును అందుకొన్నారు. ఆర్మూర్ మండలంలోని క్షత్రియ కాలేజీలో ప్రస్తుతం ఆయన విధులు నిర్వహిస్తున్న ఆయన గురువారం ఉపాధ్యాయ దినోత్సవ సంధర్భంగా అవార్డును ఆయన అందుకున్నారు. సందర్బంగా ఎంఈవో రాజగంగరాం అధ్వర్యంలో భ్రిజేష్ ను శాలువ, పూలమాలలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పీఈటీలు తదితరులు పాల్గొన్నారు.