బతుకమ్మ నిజామాబాద్ క్రైo : నిజామాబాద్ జిల్లా సిరికొండ అటవీ రేంజ్ అధికారి వినాయక్ ను సస్పెన్షన్ చేస్తూ రాష్ట్ర పీసీసీఎఫ్ ఉత్తర్వులు జారీ చేశారు. నిజామాబాద్ జిల్లాలో కొత్తగా ఏర్పడిన సిరికొండ రేంజ్ కు వినాయక్ తొలి ఎఫ్ ఆర్ ఓ కావడం గమనార్హం. సిరికొండ మండలం లోని రావుట్ల తూంపల్లి బీట్ల పరిధిలో అటవీ భూముల ఆక్రమణ, అటవీ సంపద తగ్గిపోవడంపై అధికారులు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. గత నెలలో సిరికొండ శిక్షణ ఆఫీసర్ అధికారి ఈ సెక్షన్ ఆఫీసర్ వసంతరావు, బేస్ క్యాంపు తాత్కాలిక ఉద్యోగి నరేందర్ లను సస్పెన్షన్ చేశారు. ఎఫ్ఆర్ఓ పై ఆరోపణలు రావడంతో ఆర్మూర్ ఎఫ్ డి ఓ తో విచారణ జరిపించారు. ఆయన ఇచ్చిన నివేదిక ఆధారంగా సిరికొండ ఎఫ్ఆర్ఓ వినాయకుని సస్పెన్షన్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.