జిజి హెచ్ లో రక్షా బందన్ వేడుకను నిర్వహించిన బ్రహ్మకుమారీలు

బతుకమ్మ నిజామాబాద్ సిటీ : ఆధ్యాత్మిక వేత్తలు బ్రహ్మకుమారీలు అయినా సునీత బెహన్ జి, శ్రీనివాస్ వారి బృందం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి నిజామాబాదు సూపరింటెండెంట్ డాక్టర్ ప్రతిమ రాజ్ కి ఆసుపత్రి సిబ్బందికి రక్షా బంధన్ పురస్కరించుకొని రాఖీలను కట్టి శుభ వచనాలను పలికారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైద్య రంగంలో పనిచేస్తున్నటువంటి సిబ్బంది సేవలు విలువ కట్టలేనివని కొనియాడారు. ఆసుపత్రిలో ధర్నా చేస్తున్న జూ డా లకు సంఘీభావం తెలియజేస్తూ, వారి విధుల పట్ల, వ్యక్తిత్వం పట్ల, మానసిక వికాసం పట్ల ప్రేరణను కలిగించే విధంగా ఉపన్యాసించారు.

Brahmakumaris who performed the Raksha Bandhan ceremony at GGH
Comments (0)
Add Comment