నిజామాబాద్, బతుకమ్మ : నగరంలోని వివిధ గణేష్ మండళ్లను సోమవారం రాత్రి బోధన్ ఎమ్మెల్యే మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు.నగరంలోని దుబ్బా ప్రాంతంలో ఉన్న జవహర్ గణేష్ మండలి తో పాటు జవహర్ కిసాన్ గణేష్ మండలి, దేవి రోడ్ లో ఉన్న రాజస్థానీ భవన్ లోగల గణేష్ మండళ్లను కూడా సందర్శించి ఆయన సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. ఆయనతోపాటు ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహేర్ బిన్ హుందాన్,నాయకులు నగేష్ రెడ్డి ,అంతిరెడ్డి రాజిరెడ్డి ,స్థానిక కార్పొరేటర్ గడుగు రోహిత్,గంగారెడ్డి తదితరులు ఉన్నారు.