బతుకమ్మ, జుక్కల్ :- జుక్కల్ మండల కేంద్రంలో శ్రీ లక్ష్మీ కల్యాణ మండపంలో బుధవారం జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంన్ సిందే జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. పూలమాలవేసి జన్మదిన వేడుకలు తెలిపారు.ఈ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో మళ్ళీ టిఆర్ఎస్ పార్టీ విజయం సాధిస్తుందని ఆయన అన్నారు. మళ్లీ నేనే ఎమ్మెల్యేగా నిలబడి ప్రజలకు సేవలు అందిస్తానని ఆయన అన్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేయడం జరిగిందని ఆయన అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేయడం లేదని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రభుత్వంలో నిధులు ఉన్నా లేకున్నా సంక్షేమ పథకాలు అమలు చేయడం జరిగిందని ఆయన అన్నారు. ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేస్తానని మాట ఇచ్చి వచ్చారని ఆయన అన్నారు. నాలుగు రూపాయలు పెన్షన్ అమలు చేస్తామని ఇప్పటివరకు అమలు చేయలేదని ఆయన అన్నారు. మళ్లీ రాష్ట్రంలో వచ్చేది టిఆర్ఎస్ ప్రభుత్వం అని అయన అన్నారు. రైతుబంధు, రైతు బీమా సౌకర్యం కల్పించడం జరిగిందని ఆయన అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హాములు అమలు చేయడం లేదని ఆయన అన్నారు. నా జన్మదిన వేడుకలు సందర్భంగా ఎక్కువ సంఖ్యలో కార్యకర్తలు అభిమానులు పాల్గొని జన్మదిన వేడుకలు పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ యశోద నీల్ పటేల్, జుక్కల్ మాజీ సర్పంచ్ బొల్లి గంగాధర్, కొడ్ఛివార్ మారుతి, మహ్మదాబాద్ మాజీ సర్పంచ్ రాజు గౌడ్, మాహ్మదాబాద్ తాండ రాజు జాదవ్, కౌలాస్ గ్రామ గ్రామస్తులు అన్వర్, రాజు, బిచ్కుంద మాజీ ఎంపీపీ అశోక్ పటేల్, పెద్ద ఏడ్గీ మాజీ ఎంపిటిసి వెంకట్ గౌడ్, చుక్కల మండల రైతు సమన్వయ కమిటీ అధ్యక్షులు గంగు నాయక్, పెద్ద ఏడ్గీ ఎంపీటీసీ సభ్యులు అభిమానులు ఎక్కువ సంఖ్యలో పాల్గొని జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.