బతుకమ్మ, నిజామాబాద్ సిటీ : నిజామాబాద్ నుండి ఆర్మూర్ కు వెళ్లే మార్గంలో విజయ్ పబ్లిక్ స్కూల్ వద్ద ఏకధాటిగా పడుతున్న వర్షాలకు ప్రధాన రహదారిపై పెద్ద గుంట ఏర్పడడంతో ఆర్ అండ్ బి అధికారుల నిర్లక్ష్యం వల్ల కేవలం ఒక చెట్టు కొమ్మ ప్రధాన రోడ్డు మధ్యలో పెట్టి చేతులు దులుపుకున్నారు. నిత్యం ఈ రహదారిలో వందల సంఖ్యలో వాహనాలు రాకపోకలు సాగుతుంటాయి. అయితే ప్రధాన రహదారిపై అటు అధికారులు ఇటు మునిసిపల్ కార్పొరేషన్ అధికారులు, స్థానిక కార్పొరేటర్ లు పట్టించుకోకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.