- రోడ్డును చదును చేసిన జీ. పీ అధికారులు
బతుకమ్మ, నిజామాబాద్ ప్రతినిధి: భీంగల్ మండలం పల్లికొండ గ్రామంలోఆధ్వానంగా తయారైనా రోడ్డుపై తుకం వేసి స్థానిక మహిళలు నిరసన తెలిపిన విషయం విధితమే. కాగా రోడ్డుపై తుకం వేస్తూ మహిళా వినూత్న నిరసన అనే శీర్షికను బతుకమ్మ ప్రచురించిగా స్థానిక అధికారులు స్పందించారు. శుక్రవారం ఉదయమే బ్లేడ్ ట్రాక్టర్ తో రోడ్డుపై ఉన్న బురదను లాగించి రోడ్డు చదును చేశారు. దాంతో కొత్త గ్రామపంచాయతి భవనానికి వెళ్లే రోడ్డు సైడ్ కాలనీ వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.